అక్టోబర్ 28న శ్రీవారి ఆలయం మూసివేత - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday 26 October 2023

అక్టోబర్ 28న శ్రీవారి ఆలయం మూసివేత


నెల 28న పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.ఈ నెల 29న తెల్లవారుజామున 1.05 గంటల నుంచి 2.22 గంటల మధ్య గ్రహణం ఉండగా గ్రహణ సమయానికి 6 గంటల ముందు తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది.ఈ క్రమంలో అక్టోబర్ 28 రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూసి వేయనున్నట్లుగా టీటీడీ అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 28న సహస్రదీపాలంకరణ సేవ, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. తిరిగి 29వ తేదీన ఆలయాన్ని శుభ్రం చేసి తెల్లవారుజామున 3.15 గంటలకు తెరవనున్నారు. తిరుమల ఆలయంతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను కూడా పాక్షిక చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నారు. 

No comments:

Post a Comment