హమాస్ దాడికి "ఇండియా-మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్" ఒక కారణం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday 26 October 2023

హమాస్ దాడికి "ఇండియా-మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్" ఒక కారణం !


జ్రాయిల్‌పై హమాస్ దాడికి ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్ కారణమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. హమాస్ దాడికి ఈ కారిడార్ కూడా ఒక కారణమని నేను నమ్ముతున్నానని, దీనికి నా దగ్గర ఎలాంటి రుజువులు లేవు, నా ప్రవృత్తి నాకు చెబుతోంది, ఈ ప్రాంతంలో ఇజ్రాయిల్ మరింతగా దగ్గర అవుతుండటం, ఈ ప్రాంత సమైక్యత కోసం పురోగతి సాధిస్తున్న క్రమంలో ఈ దాడి జరిగిందని, మేము ఈ పనిని వదిలి పెట్టమని బైడెన్ చెప్పారు.ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్‌తో జాయింట్ మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జీ20 సమావేశంలో ''ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్''పై భారత్, యూఎస్ఏ, యూఏఈ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ ఈ ఒప్పందంపై ఎంఓయూ కుదుర్చుకున్నాయి.ఈ కారిడార్ వల్ల ఇండియా, పశ్చిమాసియా, మధ్యప్రాచ్యం, యూరప్ మధ్య మెరుగైన కనెక్టివిటీ ఏర్పడుతుంది. దీంట్లో భాగంగా భారీ ఓడరేవులు, రోడ్డు, రైలు మార్గాలతో అరబ్, మిడిల్ ఈస్ట్ దేశాలను ఇజ్రాయిల్, యూరప్, ఇండియాలను కనెక్ట్ చేయవచ్చు. భారతదేశం ద్వారా ఆగ్నేయాసియా దేశాలకు వస్తువులు, సేవల్ని సులభంగా ఎగుమతి చేయవచ్చు. చైనా ' బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)'కి వ్యతిరేకంగా ఈ ప్రాజెక్టు కీలకం అవుతుందని యూరప్, అమెరికా, ఇజ్రాయిల్, సౌదీ, యూఏఈ వంటి దేశాలు భావిస్తున్నాయి. 

No comments:

Post a Comment