షీ జిన్ పింగ్ హాజరుకాకపోవడం నిరాశకు గురిచేసింది !

Telugu Lo Computer
0


న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు తన భారత పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఈ సందర్భంగా విలేఖరులతో బైడెన్ మాట్లాడుతూ చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాకపోవడం నిరాశకు గురిచేసిందని అన్నారు. కానీ తాను త్వరలోనే అతన్ని చూడనున్నట్టు బైడెన్ చెప్పారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా హాజరుకానున్నట్టు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)