బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 2 September 2023

బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు !


ధ్యప్రదేశ్‌ లో ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బిజెపిలోని కొంతమంది సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ సమక్షంలో వీరేంద్ర రఘువంశీ కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా కమల్‌నాథ్‌ మాట్లాడుతూ కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా వర్గానికి చెందిన వారే కాకుండా ఇతర బిజెపి నేతలు చాలామంది నాతో టచ్‌లో ఉన్నారు. రాష్ట్రంలోని స్థానిక నాయత్వం అంగీకరిస్తేనే బిజెపి నేతలు కాంగ్రెస్‌ పార్టీలోకి చేరుతారు. సింధియాకు నమ్మిన బంటుగా ఉన్న సమందర్‌ పటేల్‌ కూడా గత నెల స్థానిక కాంగ్రెస్‌ నాయకత్వం అనుమతితోనే పార్టీలోకి చేరారు.' అని ఆయన అన్నారు. కాగా, రఘువంశీ బిజెపి వీడిన మరుసటి రోజే శుక్రవారం రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గిరిజ శంకర్‌ బిజెపికి రాజీనామా చేయడం గమనార్హం. వింధ్య ప్రాంతానికి చెందిన ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు, మహాకౌశల్‌, బుందేల్‌ఖండ్‌ ప్రాంతాలకు చెందిన బిజెపి నేతలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. గడచిన మూడు నెలల కాలంలో పలువురు బిజెపి నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లోకి చేరారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి కైలాష్‌ జోషి కుమారుడు మాజీ మంత్రి దీపక్‌ జోషి, మాజీ ఎమ్మెల్యే రాధేలాల్‌ బాఘేల్‌, మాజీ ఎమ్మెల్యే కున్వర్‌ ధ్రువ్‌ ప్రతాప్‌సింగ్‌, మాజీ ఎమ్మెల్యే దేశరాజ్‌ సింగ్‌ కుమారుడు యద్వేంద్ర సింగ్‌, సమందర్‌ సింగ్‌ పటేల్‌ ఉన్నారు. వీరితోపాటు బిజెపి మాజీ ఎంపి మఖాన్‌సింగ్‌ సోలంకి బిజెపికి రాజీనామా చేసి ఏప్రిల్‌లో కాంగ్రెస్‌లో చేరారు.

No comments:

Post a Comment