రక్షాబంధన్ సందర్భంగా ఆనంద్ మహీంద్ర ట్విట్టర్లో ఓ ఫొటో షేర్ చేస్తూ.. 'కొన్ని సంవత్సరాల క్రితం రాఖీ సందర్భంగా నా సోదరి రాధిక, నేను కలిసి ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోను పోస్ట్ చేశాను. అయితే, ఎవరో దాన్ని కలర్ ఫొటోగా మార్చారు. ఇప్పుడు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ఫొటోను మళ్లీ పోస్ట్ చేస్తున్నాను' అని రాసుకొచ్చారు. అయితే పోస్ట్ చివర్లో తన చెల్లి అనూజకు క్షమాపణలు చెప్పారు. ఎందుకంటే ఆ ఫొటో తీసిన సమయంలో ఆమె ఇంకా పుట్టలేదని తెలిపారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
చెల్లి అనూజకు క్షమాపణలు !
August 31, 2023
0
Tags