వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను చమురు సంస్థలు రూ.99.75 మేర తగ్గించాయి. దీంతో దేశ రాజధానిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,680కు దిగొచ్చింది. అయితే గృహ వినియోగ సిలిండర్ ధరలోమాత్రం ఎటువంటి మార్పూ లేదు. కొత్త ధరలు నేటి నుంచి అమలులోకి వచ్చాయి. విమాన ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు వరుసగా రెండో సారి పెరిగాయి. దీంతో దేశరాజధాని దిల్లీలో ఈ ధర కిలోలీటరుకు రూ.7,728 పెరిగి, రూ.98,508.26కు చేరింది. ఇక ముంబయిలో కిలో లీటరు ధర రూ.92,124.13గా ఉంది. ఇదిలా ఉండగా దేశీయ చమురు ఉత్పత్తిపై విధించే విండ్ఫాల్ పన్నులో మాత్రం ఎటువంటి మార్పు తీసుకురాలేదు. పెట్రోల్, ఏటీఎఫ్లపై విండ్ఫాల్ పన్నును విధించటం లేదని కేంద్రం తన నోటిఫికేషన్లో తెలిపింది. https://t.me/offerbazaramzon
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.99.75 మేర తగ్గింపు !
August 01, 2023
0
Tags