రానున్న లోక్సభ ఎన్నికలలో బిజెపితో చేతులు కలపాలని జెడిఎస్ యోగిస్తున్నట్లు జోరుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో కుమారస్వామి నుంచి ఈ రకమైన స్పందన రావడం ఆసక్తికర పరిణామం. గతంలో కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీలతో జెడిఎస్ పొత్తు పెట్టుకుంది. 2019 లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్తో కలిసే జెడిఎస్ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం గమనార్హం. 2024 లోక్సభ ఎన్నికలలో ఏ కూటమిలో చేరే అవకాశం ఉందన్న ప్రశ్నకు కాంగ్రెస్పై విమర్శలను కుమారస్వామి గుప్పించారు. జెడిఎస్ పని అయిపోయిందన్న భావనలో మహాగట్బంధన్(కాంగ్రెస్ కూటమి) నిర్వాహకులు ఉన్నారని, తమను ఆహ్వానించారా లేదా అన్న విషయాన్ని తాను పట్టించుకోబోనని ఆయన చెప్పారు. బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశానికి ప్రొటోకాల్ కోసం ఐఎఎస్ అధికారులను నియమించాలన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. ఇటువంటి సమావేశాల కోసం ఐఎఎస్ అధికారులను అధికార పార్టీ నియమించిన ఉదంతాలు గతంలో ఎన్నడూ లేవని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశానికి జెడిఎస్కు ఆహ్వానం పంపకపోవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఘాటుగా సమాధానమిచ్చారు. స్వాతంత్య్ర సంగ్రామం జరుగుతున్నపుడు అందులో పాల్గొనడానికి రావాలంటూ మహాత్మా గాంధీ, సుభాష్ చంద్ర బోస్, జవహర్ లాల్ నెహ్రూ ఎవరికీ ఆహ్వానాలు పంపలేదని వ్యాఖ్యానించారు. దేశం పట్ల, రాజ్యాంగ పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం ఆందోళన ఉన్నవాళ్లు ఎవరైనా సమావేశానికి రావచ్చని ఆయన చెప్పారు. https://t.me/offerbazaramzon