కోపంతో ప్రియుడిని ఐదుసార్లు కారుతో గుద్ది చంపిన ప్రియురాలు !

Telugu Lo Computer
0


చైనాలోని జెజియాంగ్‌కు చెందిన జూన్ 28న 38 ఏళ్ల మహిళ తన 44 ఏళ్ల ప్రియుడిని కారుతో గుద్ది హత్య చేసింది. దీంతో పోలీసులు ఆ మహిళను అరెస్టు చేశారు. హత్యకు ముందు ఇద్దరూ ఓ ప్రదేశంలోని పార్కింగ్ ఏరియాలో ఉన్నారు. ఆ తర్వాత ఏదో విషయంలో వారి మధ్య వాగ్వాదం మొదలైందని చెబుతున్నారు. ఆ తర్వాత ఆ మహిళ కోపాన్ని అదుపు చేసుకోలేక ఆగ్రహానికి గురైంది. అనంతరం ప్రియుడిని కారుతో గుద్దేసింది. అయినా ఆమె కోపం చల్లారకపోవడంతో ఆమె తన ప్రియుడి శరీరంపై ఐదుసార్లు కారును నడపడానికి ప్రయత్నించింది. హృదయ విదారకమైన ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఫుటేజీలో ప్రియుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ మహిళ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. దాదాపు ఐదుసార్లు ఆ వ్యక్తిపై నుంచి కారును నడిపింది. ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కారు వదిలి పారిపోయింది. ఆమె కారు టైర్ కింద ప్రియుడి కాలు, కడుపు బాగా నలిగిపోయింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.   https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)