కారు బావిలో పడి ఆరుగురు దుర్మరణం

Telugu Lo Computer
0


ఝార్ఖండ్ లోని హజారీబాగ్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం కారు బావిలో పడడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు దుర్మరణం చెందారు. హజారీబాగ్ జిల్లా రోమీ గ్రామ సమీపంలో ఎస్‌యువి కారు అదుపు తప్పి రోడ్డు పక్కన బావిలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని హజరీబాగ్ ఎస్‌పి మనోజ్ రతన్ చౌదే తెలియజేశారు. బైకును తప్పించడానికి ప్రయత్నించే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిసినట్టు ఆయన చెప్పారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి ఉన్నారు. రిస్క్యూ బృందాలు వచ్చి బావి లోంచి మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాదం నుంచి బయటపడిన ముగ్గురు మహిళల్లో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)