భారత్-బ్యాంకాక్‌ హైవే 70శాతం పూర్తి !

Telugu Lo Computer
0


భారత్, మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలు కలిసి నిర్మిస్తున్న భారత్-బ్యాంకాక్‌ హైవే త్వరలోనే పూర్తి కానుంది. దాదాపు 1,360 కి.మీ పొడవుతో భారత్, మయన్మార్, థాయ్‌లాండ్ సంయుక్తంగా నిర్మిస్తున్న కోల్‌కతా-బ్యాంకాక్ హైవేతో రోడ్డు మార్గ ప్రయాణం సాధ్యమవ్వనుంది. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ భారత్-మయన్మార్-థాయ్‌లాండ్ హైవే దాదాపుగా 70 శాతం పూర్తయిందని చెప్పారు. నితిన్ గడ్కరీ వార్తా సంస్థ పిటిఐ మాట్లాడుతూ, హైవే ప్రాజెక్ట్‌లో 70 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. 3 దేశాలు నిర్మిస్తున్న ఈ హైవే పనులు వచ్చే 3-4 ఏళ్లలో పూర్తి కాగలవని ఆయన అన్నారు. పూర్తయిన తర్వాత, కోల్‌కతా నుండి బ్యాంకాక్‌కు రోడ్డు మార్గంలో ప్రయాణించే వీలు ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్ట్ పూర్తైన తరువాత  లావోస్, కంబోడియా, వియత్నాం ప్రాంతాలకు త్రైపాక్షిక రహదారిని విస్తరించాలని భారతదేశం యోచిస్తోంది. మణిపూర్‌లోని భారత్-మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని మోర్ అనే ప్రదేశం నుంచి భారత్-మయన్మార్-థాయ్‌లాండ్ హైవే ప్రారంభమవుతుంది. ఈ ఎక్జైటింగ్ జర్నీ భారత్-మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని మోర్ నుండి మయన్మార్-థాయ్‌లాండ్ సరిహద్దులో ఉన్న మే సోట్ అనే అందమైన పట్టణానికి తీసుకెళ్తుంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)