బాలికల వాష్‌రూమ్‌లో కెమెరాలు !

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని పూణే, తాలెగావ్‌లోని డీవై పాటిల్ స్కూల్‌లో  బాలికల వాష్‌రూమ్‌లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని తమ పేరెంట్స్‌కు తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానికులు ఆ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను కొట్టారు. ఇటీవల స్కూల్‌లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే బాలికల వాష్‌రూమ్‌లో కూడా సీసీటీవీ కెమెరాలను అమర్చారు. విద్యార్థినులు దీని గురించి తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో దీనిపై దర్యాప్తు జరుపాలని పేరెంట్స్‌ డిమాండ్‌ చేశారు. కాగా, ఈ విషయం తెలిసిన విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలు ఆ స్కూల్‌ ప్రిన్సిపాల్‌పై దాడి చేసి కొట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ను చూపించి క్రైస్తవ మతంలోకి మారాలని బాలికలను బ్లాక్‌మెయిల్‌ చేసే అవకాశం ఉందని ఆరోపించారు. అలాగే విద్యార్థులతో బలవంతంగా క్రైస్తవ ప్రార్థనలు చేయిస్తున్నారని విమర్శించారు. మరోవైపు బాలికల వాష్‌రూమ్‌లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై విద్యా శాఖ అధికారులు కూడా స్పందించారు. ఆ స్కూల్‌ ప్రిన్సిపాల్‌, యాజమాన్యంపై తగిన చర్యలు చేపడతామని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)