మహారాష్ట్ర సర్కారు ట్రిపుల్ ఇంజన్ సర్కారుగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అన్నారు. తమ ప్రభుత్వంలో ఇప్పుడు ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారని, ఇప్పటి వరకు ఉన్న డబుల్ ఇంజన్ సర్కారు, అజిత్ పవార్ చేరికతో ట్రిపుల్ ఇంజన్ సర్కారుగా మారిందని చెప్పారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్, ఆయన వర్గం నేతలకు ఏక్ నాథ్ షిండే స్వాగతం పలికారు. మహారాష్ట్ర బలోపేతానికి ఈ చేరిక దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్రాన్ని డెవలప్ చేసేందుకే తామంతా కలిసినట్లు తెలిపారు. గత లోక్ సభ ఎన్నికల్లో విపక్షాలకు నాలుగైదే సీట్లు వచ్చాయని..ఈ సారి అవికూడా రావడం కష్టమని ఎద్దేవా చేశారు. https://t.me/offerbazaramzon
మాది ట్రిపుల్ ఇంజన్ సర్కారు : ఏక్ నాథ్ షిండే
July 02, 2023
0
Tags