మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలో నలుగురు యువకులు ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె మైనర్ సోదరిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. నిందితుల్లో బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధిత బంధువులు స్థానిక పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సొంత గడ్డపై ఈ ఘటన జరగడం గమనార్హం. బాధితుల్లో మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నం చేయగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు. బాధితులు, నిందితులు విద్యార్థులని వెల్లడించారు. నిందితులపై ఇండియన్ పీనల్ కోడ్, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. తన సోదరిని నలుగురు యువకులు ఎత్తుకుపోయారని మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం తన సోదరిపై అత్యాచారం చేశారని పేర్కొంది. నిందితులు ఉన్నావ్ పోలీసు స్టేషన్ పరిధిలోని వారని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. https://t.me/offerbazaramzon
అక్కా చెల్లెళ్లపై లైంగిక వేధింపుల్లో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు !
July 16, 2023
0
Tags