తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త జడ్జీలు !

Telugu Lo Computer
0


తెలుగురాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు రానున్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్‌ ఆరాధే, ఆంధ్రప్రదేశ్  హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ధీరజ్‌సింగ్ ఠాకూర్‌ నియామకం జరిగింది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల హైకోర్టు లకు కొత్త జడ్జీలు నియమించారు. బొంబాయి. గుజరాత్‌, ఒడిశా, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం బుధవారం సమావేశమై చర్చించారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా కర్ణాటక హైకోర్టు జడ్జిగా ఉన్న అలోక్ ఆరాధేను, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బాంబే హైకోర్టు జడ్జిగా ఉన్న ధీరజ్ సింగ్ ఠాకూర్ ను నియమించింది. బాంబే హైకోర్టుకి దేవేంద్రకుమార్, గుజరాత్ కు సునీతా అగర్వాల్, మణిపూర్ కు సిద్ధార్థ్ మృదుల్, కేరళకు ఆశిష్ దేశాయ్, ఒరిస్సాకు సుబాసిస్ తలపత్ర నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ ఎస్‌ వెంకటనారాయణ భట్టిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)