టమాటా పొలంలోదొంగలుపడ్డారు !

Telugu Lo Computer
0


ర్ణాటకలోని హాసన్ జిల్లాలో విచిత్రమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏ ఇంట్లోనో, బంగ్లాలోనో దొంగలు చోరీకి పాల్పడలేదు. రైతు పొలంలో దొంగలు పడ్డారు. రైతు పొలంలో లక్షల రూపాయల విలువైన టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జూలై 4 రాత్రి తన పొలంలో కిలోల కొద్దీ టమోటాలను దొంగలు ఎత్తుకెళ్లారని రైతు ధరణి తెలిపింది. టమాట ధర దాదాపు రూ.2.5 లక్షలు. రెండెకరాల పొలంలో టమాట పంట సాగు చేశానని ధరణి పేర్కొంది. టమాటా పంటను పండించి మార్కెట్‌లో విక్రయించాలనే ఆలోచనలో ఉండగా, ఆ సమయంలో దొంగలు టమాటాను ఎత్తుకెళ్లారు. టమోటా దొంగతనంపై రైతు ధరణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనగ పంటలో నష్టం వచ్చిందని, అందుకే అప్పు చేసి టమాటా సాగు చేశానని ధరణి చెప్పింది. టమోటాలు దొంగిలించిన తరువాత, దొంగలు తన పంటను కూడా ధ్వంసం చేశారని ధరణి తెలిపింది. హళేబీడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.   https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)