జియో రూ.19, రూ.29 డేటా ప్లాన్లు !

Telugu Lo Computer
0


రిలయన్స్ జియో తాజాగా రెండు కొత్త ప్రీపెయిడ్ డేటా ప్యాక్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 19, రూ. 29 ప్లాన్లు. 1 జీబీ లేదా 2 జీబీ కంటే కొంచెం ఎక్కువ డేటాను కోరుకునే వారు ఈ ప్లాన్ లను రిఛార్జి చేసుకోవచ్చు. రూ.19 డేటా ప్యాక్‌ను 1.5 జీబీ డేటాతో అందిస్తోంది. దీని కాల వ్యవధి ప్రస్తుత ప్రీపెయిడ్ ప్యాక్ లాగే ఉంటుంది. 1జీబీ డేటాను అందించే రూ.15 ప్యాక్ నుంచి తాజా ప్యాక్​తో జియో మరో మెట్టు ఎక్కినట్టైంది. సో.. మీకు అదనంగా 500ఎంబీ డేటా కావాలంటే, రూ. 4 అదనంగా చెల్లించాలి. రూ.29 ప్రీపెయిడ్ ప్లాన్ తో 2.5 జీబీ డేటాను జియో అందిస్తోంది. ఈ ప్లాన్ కూడా వినియోగదారుల యాక్టివ్ బేస్ ప్రీపెయిడ్ ప్లాన్‌కు సమానంగా ఉంటుంది. ఇప్పటికే ఉన్న రూ. 25 డేటా బూస్టర్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవడానికి ఇష్టపడే వినియోగదారులకు ఈ ప్లాన్ డికాయ్ ఎఫెక్ట్‌గా కూడా ఉపయోగపడుతుంది. జియో నుండి రూ.25 ప్లాన్ 2జీబీ డేటాతో వస్తోంది. తాజా నిర్ణయంతో 2జీబీ కి బదులుగా, వినియోగదారులు అదనంగా రూ. 4 చెల్లించి 2.5 జీబీ ని పొందవచ్చు. తాజా ప్లాన్​లను ఒక సారి చెక్​ చేసేయండి మరి.    https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)