హర్యానా లోని అంబాలా-యమునానగర్ రోడ్డుపై ఓ బస్సు బోల్తాపడింది. నదీ ప్రవాహం ఎక్కువ కావడంతో ఆ వరద ధాటికి ఓ బస్సు ఓవర్టర్న్ అయ్యింది. అయితే బస్సులో ఉన్న 27 మంది ప్రయాణికులు .. ఆ బస్సుపై ఎక్కేశారు. రెస్క్యూ చర్యలు చేపట్టిన పోలీసులు ఆ ప్రయాణికుల్ని కాపాడారు. క్రేన్, తాడు సహాయంతో బస్సు ప్రయాణికుల్ని రక్షించారు. హర్యానా రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. ఉత్తరాదిలో వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. ఆ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో బురదతో కూడిన వరదలు ముంచెత్తుతున్నాయి. ఆ వరదల్లో ఇండ్లు, వాహనాలు కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాల వల్ల పంజాబ్, హర్యానాలోని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అంబాలాలో స్కూళ్లు, ప్రభుత్వ ఆఫీసులు మూసివేశారు. మార్కండ, ఘాగర్, తంగ్రి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అంబాలా వద్ద డేంజర్ మార్క్ దాటి పారుతున్నాయి. https://t.me/offerbazaramzon
నదీ ప్రవాహంలో బస్సు బోల్తా !
July 10, 2023
0
Tags