ఈడీ అధికారులకు లొంగిపోయిన మాగుంట రాఘవ

Telugu Lo Computer
0


మద్యం కేసులో జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న మాగుంట రాఘవ తీహార్ జైలు వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల ముందు లొంగిపోయాడు. రాఘవకు తొలుత ఢిల్లీ హైకోర్టు 2 వారాల మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు  మధ్యంతర బెయిల్‌ పరిమితి కుదించి లొంగిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మాగుంట రాఘవ ఈడీ అధికారులకు లొంగిపోయాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)