కరీంనగర్లో ఓ హోటల్ యజమాని ప్రకటించిన ఆఫర్ బిర్యానీ ప్రియులకు ఆకర్శించింది. ఒక్క రూపాయికే బిర్యానీ అనేసరికి పరుగులు పెట్టారు. ఎండను సైతం లెక్క చేయకుండా బారులు తీరారు. ఒక్క రూపాయికే బిర్యానీ ఇంత వరకు ఒకే. కానీ కాయిన్తో వెళ్తే మాత్రం ఇవ్వరండోయ్. రూపాయి నాణేలకు బదులుగా నోటు ఇస్తేనే బిర్యానీ. అయినా జనం ఏమాత్రం తగ్గలేదు. తమ ఇంట్లో మూలన పడేసిన పాత రూపాయి నోట్లను పట్టుకుని అక్కడికి చేరుకున్నారు. ఇచ్చిన ఆఫర్ చూసి భారీగా జనం రావడంతో హోటల్ యాజమన్యం అవాక్కయ్యింది. ఊహించని విధంగా జనం రావడంతో బిర్యానీ సెంటర్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్డుపై గందరగోళం నెలకొంది. ఈ విషయం ట్రాఫిక్ పోలీసులకు తెలియడంతో చేతిలో కెమెరా పట్టుకొని అక్కడకు వెళ్లారు. నాటి రూపాయి నోటును తీసుకుని బిర్యానీ కోసం ద్విచక్ర వాహనంపై వచ్చిన వారికి ట్రాఫిక్ పోలీసులు రివర్స్ ట్విస్ట్ ఇచ్చారు. రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేసిన వారికి 200 ఫైన్ చేశారు. ప్చ్..! రూపాయి బిర్యానీ కోసం వెళ్తే రూ. 200 జేబుకు చిల్లులు పడిందని నిరాశపడ్డారు.
Post a Comment
0Comments
3/related/default