ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జననం !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా ఉచెహ్రా మండలం అతర్వేదియా ఖుర్ద్‌ గ్రామానికి చెందిన గోవింద్‌ కుష్వాహా (62) కొంతకాలం క్రితం హీరాబాయి కుష్వాహా (30)ను రెండో వివాహం చేసకున్నాడు. ఈ క్రమంలో ఆమె గర్భందాల్చగా సోమవారం రాత్రి హీరాబాయికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సిజేరియన్‌ చేసి ప్రసవం చేశారు. హీరాబాయి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఒకేసారి ముగ్గురు పిల్లలకు తండ్రయ్యే సరికి గోవింద్‌ కుష్వాహా ఆనందానికి అవదులు లేవు. శిశువులు కాస్త బలహీనంగా ఉండటంతో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యుడు అమర్‌ సింగ్‌ తెలిపారు. గోవింద్‌ మీడియాతో మాట్లాడుతూ ‘నేను రెండు పెళ్లిళ్లు చేసుకున్నాను. నా మొదటి భార్య పేరు కస్తూరిబాయి. ప్రస్తుతం ఆమెకి 60 ఏళ్లు. మాకు కుమారుడు పుట్టాడు. అయితే 18 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో నా మొదటి భార్య కస్తూరిబాయే దగ్గరుండి మరీ నాకు రెండో వివాహం జరిపించింది. పెళ్లయిన ఆరేళ్లకు హీరాబాయి ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడంతో ఆనందంగా వుంది. .

Post a Comment

0Comments

Post a Comment (0)