జమ్మూ కాశ్మీర్ లో గత 24 గంటల్లో జమ్ము-కాశ్మీర్, లడఖ్లో ఐదుసార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూ ప్రకంపనల తీవ్రత 4.5గా నమోదైంది. శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు జమ్మూ కాశ్మీర్లో మొదటి భూకంపం సంభవించింది. దీని తీవ్రత 3.0. శనివారం రాత్రి 9.44 గంటలకు లేహ్లో రెండవ ప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత 4.5. ఇండో-చైనా సరిహద్దు సమీపంలోని జమ్మూ కశ్మీర్లోని దోడా వద్ద రాత్రి 9.55 గంటలకు మూడో ప్రకంపనలు సంభవించగా, ఈ భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, ఆదివారం తెల్లవారుజామున 2.16 గంటలకు ఈశాన్య లేహ్లో నాల్గవ భూకంపం సంభవించింది. దీని తీవ్రత 4.1. అయితే భూ ప్రకంపనల తర్వాత ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారుల తెలిపారు. దీని తరువాత, జమ్మూ కాశ్మీర్లోని కత్రాలో ఆదివారం తెల్లవారుజామున 3.50 గంటలకు ఐదవ, చివరి ప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత మళ్లీ 4.1 గా నమోదైంది. భారత వాతావరణ శాఖ అధికారి ప్రకారం, మధ్యాహ్నం 2 గంటలకు సంభవించిన భూకంపం కేంద్రం జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారితో పాటు కొండ రాంబన్ జిల్లాలో ఉంది. భూకంప తీవ్రత లోతు 33.31 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 75.19 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉపరితలం నుండి ఐదు కిలోమీటర్ల దిగువన వచ్చినట్లుగా గుర్తించారు.
జమ్మూ కాశ్మీర్ లో 24 గంటల్లో ఐదుసార్లు భూప్రకంపనలు !
June 18, 2023
0
Tags