మినీ ట్రక్కు నదిలో పడి 12 మంది దుర్మరణం

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అదపు తప్పిన మినీ ట్రక్కు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా మరి కొంత మంది గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా.. వారంతా మినీ ట్రక్కులో వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లా బుహ్రలో ఈ ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్‌లోని దతియా వద్ద ఎల్‌ మినీ ట్రక్‌ నదిలో పడిపోయింది. మినీ లారీలో దాదాపు 50 మంది కూలీలు ఉన్నారు. ఈ ప్రమాదంలో 12 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. ఐదుగురి మృతదేహాలు లభ్యం కాగా మిగిలిన వారు గల్లంతయ్యారు. దుర్సాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుహ్ర గ్రామంలో బుధవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు వంతెన దాటుతుండగా అదుపు తప్పి బోల్తా పడింది. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ట్రక్కులో దాదాపు 50 మంది కూలీలు ఉన్నారు. గ్వాలియర్‌లోని భేలేటి గ్రామం నుంచి తికమ్‌గఢ్‌లోని జాతర గ్రామానికి పెళ్లి కోసం వెళ్తున్నారు.

మినీ ట్రక్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్టుగా చెబుతున్నారు. బుహ్రా నదిలో ట్రక్కు పడిపోయిందనే సమాచారం అందిన వెంటనే గ్రామస్థులు అక్కడికి చేరుకుని ట్రక్కులోని వారిని రక్షించే ప్రయత్నం ప్రారంభించారు. గ్రామస్తులు అధికార యంత్రాంగానికి సైతం సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం నదిలో పడిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వ్యక్తులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇప్పటికీ కొంతమంది వ్యక్తుల ఆచూకీ తెలియడం లేదని.. ఎస్‌డీఆర్ఎఫ్ బృందం ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపడుతుందని స్థానిక అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)