గుండెపోటుతో బాలిక మృతి

Telugu Lo Computer
0


గుజరాత్ లోని నవసారి పరిధిలోని పర్తాపూర్ కు చెందిన తానీషా గాంధీ (17) తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఈ బాలిక స్థానికంగా ఉండే ఓ కాలేజీ లో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఇక ఎప్పటిలాగే తానీషా గాంధీ సోమవారం కాలేజీకి వెళ్లింది. విరామ సమయంలో క్లాస్ రూమ్ లో విద్యార్థులంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తానీషా గాంధీ ఉన్నట్టుండి ఒక్కసారిగా క్లాస్ రూమ్ లోనే కుప్పకూలింది. తోటి విద్యార్థులు వెంటనే స్పందించి టీచర్లకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఆ బాలికను టీచర్లు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆ బాలిక గుండెపోటుతో మరణించినట్లుగా నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు సైతం కన్నీరు మున్నీరుగా విలపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)