రెండువేల ఏళ్ల నాటి ఆధునిక సమాజపు ఆనవాళ్లు లభ్యం !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లోని  బాంధవ్‌గఢ్ నేషనల్ పార్క్‌లో జరిగిన కొత్త పురావస్తు అన్వేషణలో ఆధునిక సమాజం ఆనవాళ్లు బయటపడ్డాయి, ఇది దాదాపు రెండు వేల సంవత్సరాల పూర్వం ప్రస్తుత పులుల ఆవాసాలను పాత వాణిజ్య మార్గంగా ఉపయోగించింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ట్రేడ్ రూట్‌ ఇప్పుడు మనం బాంధవ్‌గఢ్‌ టైగర్ రిజర్వ్ అని పిలుస్తున్న ప్రాంతం మీదుగా వెళుతుంది. ఈ ప్రాంతంలో 1,500 సంవత్సరాల నాటి రాక్ పెయింటింగ్ 2,000 సంవత్సరాల నాటి మానవ నిర్మిత జలవనరుల నిధిని ఇటీవల కనుగొన్నారు. ఆ ప్రదేశంలో జరుగుతున్న తవ్వకాల్లో వేలాది సంవత్సరాల కిందటే అధునాతన సమాజ పోకడలకు బీజం పడినట్టు ఆధారాలు లభ్యమయ్యాయని ఏఎస్ఐ జబల్‌పూర్ సర్కిల్ సూపరింటెండెంట్ శివకాంత్ బాజ్‌పాయ్ వెల్లడించారు. ఎత్తైన ప్రదేశంలో నీటి వనరుల నిర్మాణం, వాననీటిని సేకరించేలా నిర్మాణం చేపట్టిన తీరు చూస్తే ఈ ప్రాంత అధునాతన సమాజ ఆనవాళ్లను వెలికితీస్తున్నదని చెప్పారు. ఈ జలవనరులు 1800 నుంచి 2000 ఏండ్ల నాటివని, అయితే వేయి సంవత్సరాల కిందట వీటిని పునరుద్ధరించినట్టు ఆధారాలున్నాయని తెలిపారు. బాంధవ్‌గఢ్‌లోని తల రేంజ్‌లో ఇటీవల చేపట్టిన తవ్వకాల్లో ఆశ్రయిం కోసం ఉపయోగించిన 11 రాతి గుహలు బయటపడ్డాయి. ఈ గుహల్లో ఒకదానిపై స్వర్ణ యుగం పెయింటింగ్ కనిపించింది. 1500 ఏండ్ల కిందటి రాతిపై శిల్పాలను ఈ ప్రాంతంలో తొలిసారిగా గుర్తించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)