అమెరికాలో కాల్పుల్లో ముగ్గురు మృతి

Telugu Lo Computer
0


అమెరికాలోని వాయువ్య న్యూ మెక్సికోలో 50,000 మంది జనాభా ఉన్న ఫార్మింగ్‌టన్‌లో ఉదయం 11 గంటల ప్రాంతంలో సాయుధుడు  జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, తొమ్మిదికి గాయాలయ్యాయి. అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కాల్పులు జరిపిన నిందితుడిని హతమార్చారు. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి సహా ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వీరంతా క్షేమంగా ఉన్నారని న్యూ మెక్సికో పోలీసులు తెలిపారు. అనుమానిత దుండగుడు ఎవరనేది తెలియరాలేదు. కాల్పులకు కారణం ఏంటో ఇంత వరకు తెలియరాలేదు. కాల్పుల్లో పోలీసులు ఇంకా మరణించిన లేదా గాయపడిన వారి పేర్లు తెలియలేదు. కాల్పులకు గల కారణాల గురించి ఇంకా వివరాలు అందుబాటులో లేవు. దాడి గురించి స్కూల్ టీచర్ నిక్ అకిన్స్ మాట్లాడుతూ.. దాడి జరిగిన ప్రదేశం స్కూల్ ఉన్న ప్రాంతమని చెప్పారు. ఇది అపార్ట్‌మెంట్‌లతో సహా జనసాంద్రత కలిగిన ప్రాంతం అని ఆయన తెలియజేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)