అస్సాం, అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం సంభవించింది. అస్సాంలోని సోనిట్పుర్లో సోమవారం ఉదయం 8.03 గంటలకు 4.4 తీవ్రతతో భూమి కంపించింది. భూఅంతర్భాగంలో 15 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. కాగా, తాజా భూకంపం కారణంగా ఎలాంటి నష్టమూ జరగలేదని అధికారులు చెప్పారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉదయం 7.48 గంటలకు భూకంపం వచ్చిందిన ఎన్సీఎస్ వెల్లడించింది. దీని తీవ్రత 4.8గా ఉందని, డిగ్లిపూర్ కు 137 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూమి అంతర్భాగంలో 70 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు రికార్డు అయినట్లు ఎన్సీఎస్ వెల్లడించింది.
అస్సాం, అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం
May 29, 2023
0