జేబులో ఉండగానే మొబైల్ పేలింది !

Telugu Lo Computer
0


కేరళ లోని  త్రిసూర్‌ లోని మరోటిచల్ ప్రాంతంలో ఓ హోటల్‌లో టీ తాగేందుకు వెళ్లిన పెద్దమనిషి(76).. ఆర్డర్ చెప్పి, సమీపంలో టీ తయారు చేస్తున్న వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో ఒక్కసారిగా ఆ పెద్దాయన చొక్కా జేబులో ఉన్న ఫోన్ పేలిపోయింది. ఇదంతా సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. కాగా, ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏడాది క్రితం వెయ్యి రూపాయలకు ఈ ఫోన్ కొన్నట్లు ఆ వృద్ధుడు చెప్పాడు. పేలింది సాధారణ కీప్యాడ్ ఫోన్ బ్యాటరీ చెడిపోవడం వల్లే ఫోన్ పేలిపోయిందని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే, జేబులో ఉన్న మొబైల్ ఫోన్ పేలిన సంఘటన సాధారణ విషయం కాదంటున్నారు పోలీసులు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు చాలా చోట్ల కనిపించాయి. ఇందులో కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)