రూ. 70 వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు ?

Telugu Lo Computer
0


కర్ణాటకలో రెండు మూడు నెలల్లో రాజకీయాల్లో ఊహించని మార్పులు వస్తాయని, అంత వరకు అందరూ వేచి చూడాలని కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ పార్టీ దళపతి హెచ్ డీ. కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతుందోని, ప్రభుత్వం ఏర్పాటు అయినా ఆ నాయకులు ప్రజలకు ఉత్తమ పరిపాలన అందిస్తారని నమ్మకం నాకు లేదని కుమారస్వామి అన్నారు. తన నియోజక వర్గంలో పనులు చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందు తాను చేతులు కట్టుకుని నిలబడలేనని, తన పని తాను చేస్తానని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. లోక్ సభ ఎన్నికల తరువాత ఏమైనా జరిగే అవకాశం ఉందని, అంతవరకు ఓపికగా ఉండాలని జేడీఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కుమారస్వామి సూచించారు. త్వరలో తాలుకా పంచాయితీ, జిల్లా పంచాయితీ ఎన్నికలు జరుగుతాయని, జేడీఎస్ పార్టీ నాయకులు ఆ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని, అందుకు ఇప్పటి నుంచి పని చెయ్యాలని కుమారస్వామి కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీ స్కీమ్ లు అమలు చెయ్యాలంటే రూ. 60 వేల కోట్ల నుంచి రూజ 70 వేల కోట్ల రూపాయలు డబ్బులు అవసరం అని, ఆ డబ్బులు వీళ్లు ఎక్కడి నుంచి తెచ్చి గ్యారెంటీ స్కీమ్ లు అమలు చేస్తారో మేము చూస్తామని, ప్రజలను మోసం చేస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తాము నిలదీస్తామని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)