'ది కేరళ స్టోరీ' సినిమా దర్శకుడు సుదీప్తో సేన్కు, మూవీ టీమ్ లోని మరి కొందరికి గుర్తు తెలియని నంబర్ నుంచి బెదిరింపు మెసేజులు వచ్చాయి. 'ఒంటరిగా బయటకు వెళ్లొద్దు.. మీరు మంచి పనులు చేయలేదు' అని మెసేజ్లో ఓ వ్యక్తి బెదిరించాడు. దీనిపై సుదీప్తో సేన్ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బెదిరింపులపై రాతపూర్వకంగా ఫిర్యాదు అందకపోవడంతో ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ నమోదుకాలేదు. అయితే ఆ సినిమా సిబ్బందికి మాత్రం పోలీసులు భద్రత కల్పించారు. ఈ సినిమాను కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రదర్శనను నిషేధిస్తున్నాయి. ఈ సమయంలో ఉత్తర ప్రదేశ్ మాత్రం ఈ సినిమాకు పన్ను మినహాయింపు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇదివరకు మధ్యప్రదేశ్ కూడా ఈ మినహాయింపునిచ్చింది. ఇక పశ్చిమ బెంగాల్లో సినిమాపై నిషేధం విధించగా, దాన్ని తొలగించాలని కోరుతూ 'ది కేరళ స్టోరీ' మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పశ్చిమ బెంగాల్తోపాటు తమిళనాడు అంతటా సినిమాను ప్రదర్శించే థియేటర్ల వద్ద భద్రత కల్పించాలని మేకర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
'ది కేరళ స్టోరీ' దర్శకుడికి బెదిరింపులు !
May 09, 2023
0
Tags