నా కాన్వాయ్‌ కోసం ట్రాఫిక్‌ ఆపొద్దు !

Telugu Lo Computer
0


కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సీఎం రంగస్వామి ప్రజలతో మమేకమై తిరిగే నాయకుడు. ఆయన తరచూ మోటారు సైకిల్‌పై సైతం చక్కర్లు కొడుతుంటారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయనకు పోలీసులు భద్రతను పెంచారు. ఆయన కాన్వాయ్‌ వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ను ఆపేస్తున్నారు. రోజూ గోరిమేడులోని ఇంటి నుంచి సచివాలయం వెళ్లే సమయంలో అనేక ప్రాంతాల కూడలిలో వాహనాలు నిలుపుదల చేస్తూ వస్తున్నారు. తన కారణంగా స్థానికులకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఇబ్బందులు ఎదురవుతుండడాన్ని సీఎం గమనించారు. దీంతో తన కాన్వాయ్‌ వెళ్లే మార్గాల్లో ఇకపై ట్రాఫిక్‌ ఆపాల్సిన అవసరం లేదని పోలీసులను ఆదేశించారు. ప్రజల వాహనాలతో పాటే తన వాహనం కూడా ముందుకెళ్తుందని, ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్‌ ఆపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)