నా సేవ చూసి జనం ఓట్లెయ్యాలి !

Telugu Lo Computer
0


రాజస్థాన్లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ  వచ్చే ఎన్నికల్లో తాను ఎలాంటి పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయనని చెప్పారు. తాను చేసిన సేవతోనే ప్రజల ఓట్లు గెల్చుకుంటానని స్పష్టం చేశారు. రాజకీయం అనేది పుస్తకాలు చదివితేనో, చర్చా వేదికల్లో పాల్గొంటేనో రాదని అభిప్రాయపడ్డారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తేనే అది సాధ్యపడుతుందన్నారు. గత ఎన్నికల్లో తీవ్ర పోటీ ఉన్న స్థానం నుంచి తాను బరిలోకి దిగి విజయం సాధించానని గడ్కరీ చెప్పారు. పలువురు ఒద్దన్నా తాను వెనక్కి తగ్గలేదన్నారు. ఎవరికీ ఛాయ్‌ తాగించడం వంటివి కూడా చేయనని చెప్పారు. అభివృద్ధి, సేవ, పేదల సంక్షేమం, ఆరోగ్య వసతులు కల్పించడం, యువతకు ఉపాధి, పిల్లలకు మంచి విద్యను అందించడం ద్వారానే ఓట్లు వస్తాయని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను చేసిన సేవ ఆధారంగానే భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)