పారిపోయి పెళ్లి చేసుకున్న వదిన, మరదలు !

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సంభాల్ జిల్లాలోని బహేజోయ్ అనే గ్రామంలో ఉండే ఓ యువతి కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఆ యువతికి వరసకు మరదళ్లు అయ్యే మరో యువతితో స్నేహం ఏర్పడింది. వారిద్దరు చిన్నతనం నుంచే స్నేహంగా ఉండే వారు. అయితే పెరిగిన తరువాత వారి స్నేహం ధృడంగా మారింది. ఈ క్రమంలో సదరు యువతి తన మరదలితో కలిసి నోయిడాలోని ఓ కంపెనీలో పని చేస్తుంది. ఆ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఈ విషయం ఇంట్లో వారికి తెలియడంతో వారిద్దరు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. విషయం తెలిసిన యువతుల తల్లిదండ్రులు వారి కోసం తీవ్రంగా గాలించారు. ఉత్తర ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలతో పాటు, నోయిడా ప్రాంతాల్లో తీవ్రంగా గాలించిన యువతుల ఆచూకీ లభించలేదు. అలా ఇంటి నుంచి పారిపోయిన వారు ఏడు నెలల తర్వాత తిరిగి బహేజోయ్ పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక్షమయ్యారు. తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కావాలని యువతులు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతానికి వారిద్దరిని ఎవరింటికి వారిని పంపించినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)