గజేంద్ర సింగ్ షెకావత్పై ఎఫ్ఐఆర్ నమోదు

Telugu Lo Computer
0


రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గెహ్లాట్ 10 తలల రావణుడంటూ షెకావత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చిత్తోడ్ ఘడ్ లోని సదర్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా ఐపీసీ సెక్షన్ 143,153A, 295A, 500, 504, 505 , 511 కింద కేసు ఫైల్ చేశారు. చిత్తోడ్ ఘఢ్‌లో జరిగిన జన్ ఆక్రోష్ ర్యాలీలో పాల్గొన్న గజేంద్ర షెకావత్ రావణుడికి 10 తలలున్నట్లే రాజస్థాన్ ప్రభుత్వానికి కూడా 10 తలలు ఉన్నాయని విమర్శించారు. గెహ్లాట్‌ ప్రభుత్వం అవినీతిలో ఫస్ట్ ప్లేస్ లో ఉందని, మాఫియాను పెంచి పోషిస్తుందని ఆరోపించారు. ఈ రావణుడిని అంతం చేసి రాజస్థాన్‌లో రామరాజ్యం స్థాపించాలని షెకావత్ పిలుపునిచ్చారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ కాంగ్రెస్ నేతలు రాజస్థాన్ సీఎంను అవమానించే పదజాలం ఉపయోగించినందుకు షెకావత్ ఫిర్యాదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)