దేశంలో కొత్తగా 1,580 కరోనా కేసులు నమోదు !

Telugu Lo Computer
0


గత 24 గంటల్లో 1,28,764 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా1,580 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజా కేసులతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,49,76,599కి చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.  ప్రస్తుతం 18,009 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 4,44,28,417 మంది కోలుకున్నారు. ఇక 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,753 కి ఎగబాకింది. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.04 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.77 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,88,357) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)