బెంగాల్ దేగంగాలోని వాసుదేవపూర్ లో మహ్మద్ నసీరుల్లా ఓ వ్యవసాయ కూలీ నివాసముంటున్నాడు. అతనికి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తనకు స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఉంది. అందులో అప్పుడప్పుడు బ్యాంక్ లావాదేవీలు జరిపేవాడు. అలాంటిది తాజాగా అతని అకౌంట్ లో అనుకోకుండా రూ.100 కోట్లు జమ అయినట్లు గమనించాడు. తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు నసీరుల్లాకు నోటీసులు పంపారు. మే 30 లోగా తన అకౌంట్లో ఉన్న డబ్బుకు సంబంధించిన ప్రూఫ్ పేపర్స్ సమర్పించాలంటూ నోటీసుల్లో తెలిపారు. దీంతో నసీరుల్లా బ్యాంక్ కు వెళ్లి తన అకౌంట్లోకి రూ.100 కోట్లు ఎలా వచ్చాయో తెలియదని బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. బ్యాంక్ అధికారులు అతని అకౌంట్ ను బ్లాక్ చేశారు. గత ఏడాది మేలో కూడా ఇటువంటి ఘటననే చెన్నైలో జరిగింది. టీ నగర్ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో 100 మందికి వారి అకౌంట్లో రూ.13 కోట్లు జమ అయ్యాయి. కొందరు తన అకౌంట్లో డబ్బులు వచ్చిన విషయాన్నిబ్యాంక్ అధికారులకు తెలియజేశారు. అయితే ఇంతపెద్ద నగదు ఎలా బదిలీ అయ్యిందో విచారణ చేపట్టారు. సాంకేతిక లోపం కారణాల వల్ల జరిగిందా? లేక ఇంటర్నెట్ సర్వీస్ లో ఏదైనా ప్రాబ్లమా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు బ్యాంకు నుండి ఎలాంటి వివరణ రాకపోవడం గమనించదగ్గ విషయం.
Post Top Ad
adg
Thursday, 25 May 2023
Home
National
west bengal
కూలీ అకౌంట్లో రూ.100 కోట్లు జమ
బ్యాంక్ అధికారులు అతని అకౌంట్ ను బ్లాక్ చేశారు
మహ్మద్ నసీరుల్లా ఓ వ్యవసాయ కూలీ
సైబర్ క్రైమ్ పోలీసులు నసీరుల్లాకు నోటీసులు
కూలీ అకౌంట్లో రూ.100 కోట్లు జమ !
కూలీ అకౌంట్లో రూ.100 కోట్లు జమ !
బెంగాల్ దేగంగాలోని వాసుదేవపూర్ లో మహ్మద్ నసీరుల్లా ఓ వ్యవసాయ కూలీ నివాసముంటున్నాడు. అతనికి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తనకు స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఉంది. అందులో అప్పుడప్పుడు బ్యాంక్ లావాదేవీలు జరిపేవాడు. అలాంటిది తాజాగా అతని అకౌంట్ లో అనుకోకుండా రూ.100 కోట్లు జమ అయినట్లు గమనించాడు. తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు నసీరుల్లాకు నోటీసులు పంపారు. మే 30 లోగా తన అకౌంట్లో ఉన్న డబ్బుకు సంబంధించిన ప్రూఫ్ పేపర్స్ సమర్పించాలంటూ నోటీసుల్లో తెలిపారు. దీంతో నసీరుల్లా బ్యాంక్ కు వెళ్లి తన అకౌంట్లోకి రూ.100 కోట్లు ఎలా వచ్చాయో తెలియదని బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. బ్యాంక్ అధికారులు అతని అకౌంట్ ను బ్లాక్ చేశారు. గత ఏడాది మేలో కూడా ఇటువంటి ఘటననే చెన్నైలో జరిగింది. టీ నగర్ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో 100 మందికి వారి అకౌంట్లో రూ.13 కోట్లు జమ అయ్యాయి. కొందరు తన అకౌంట్లో డబ్బులు వచ్చిన విషయాన్నిబ్యాంక్ అధికారులకు తెలియజేశారు. అయితే ఇంతపెద్ద నగదు ఎలా బదిలీ అయ్యిందో విచారణ చేపట్టారు. సాంకేతిక లోపం కారణాల వల్ల జరిగిందా? లేక ఇంటర్నెట్ సర్వీస్ లో ఏదైనా ప్రాబ్లమా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు బ్యాంకు నుండి ఎలాంటి వివరణ రాకపోవడం గమనించదగ్గ విషయం.
Tags
# National
# west bengal
# కూలీ అకౌంట్లో రూ.100 కోట్లు జమ
# బ్యాంక్ అధికారులు అతని అకౌంట్ ను బ్లాక్ చేశారు
# మహ్మద్ నసీరుల్లా ఓ వ్యవసాయ కూలీ
# సైబర్ క్రైమ్ పోలీసులు నసీరుల్లాకు నోటీసులు
About Telugu Lo Computer
సైబర్ క్రైమ్ పోలీసులు నసీరుల్లాకు నోటీసులు
Tags
National,
west bengal,
కూలీ అకౌంట్లో రూ.100 కోట్లు జమ,
బ్యాంక్ అధికారులు అతని అకౌంట్ ను బ్లాక్ చేశారు,
మహ్మద్ నసీరుల్లా ఓ వ్యవసాయ కూలీ,
సైబర్ క్రైమ్ పోలీసులు నసీరుల్లాకు నోటీసులు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment