జీవో నంబర్‌ 1 కొట్టివేత

Telugu Lo Computer
0


రోడ్డుషోలు, బహిరంగ సభలను కట్టడి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ ఏడాది జనవరి 2వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 1ను తీసుకొచ్చింది. దాన్ని సవాల్‌ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో పిల్‌ వేశారు. ఇదే జీవోను సవాలు చేస్తూ మాజీ మంత్రి, తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు గిడుగు వీర వెంకట రుద్రరాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఏఐఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఐఏవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ప్రతిపక్షాలు రోడ్డుపై నిర్వహించే కార్యక్రమాలను జీవో నంబర్‌ 1 పేరుతో అడ్డుకునే ప్రమాదం ఉందని.. అందువల్ల దాన్ని రద్దు చేయాలని ప్రతిపక్ష నాయకులు కోరారు. ఆ వ్యాజ్యాలపై జనవరి 24వ తేదీన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం లోతైన విచారణ జరిపి.. తీర్పును రిజర్వు చేసింది. తాజాగా ఆ జీవోను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)