ఎయిరిండియాకు డిజిసిఎ షోకాజ్‌ నోటీసులు

Telugu Lo Computer
0


ఎయిరిండియా సిఇఒ క్యాంప్‌బెల్‌ విల్సన్‌కు పౌర విమానయాన నియంత్రణ సంస్థ షోకాజ్‌ నోటీసులిచ్చింది. ఎయిరిండియా విమానంలోకి ఓ పైలెట్‌ తన స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించిన ఘటనపై నివేదిక సమర్పించడంలో ఎయిర్‌లైన్స్‌ వైఫల్యం చెందడంపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ ఆగ్రహం వ్యకం చేసినట్లు ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. ఎయిరిండియా భద్రత, రక్షణ- నాణ్యత హెడ్‌కి కూడా నోటీసులిచ్చినట్లు డిజిసిఎ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఏప్రిల్‌ 21నే నోటీసులు జారీ అయ్యాయని, 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 27న దుబారు నుండి ఢిల్లీ వచ్చిన ఎయిరిండియా విమానంలో పైలెట్‌ తన స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటీసులపై ఎయిరిండియా స్పందిచలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)