నెటిజన్ల మనసు దోచుకున్న ముంబయి పోలీసులు !

Telugu Lo Computer
0


ముంబయి బాంద్రా టెర్మినస్‌లో 65 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా నివాసం ఉంటోంది. కుటుంబ సభ్యులతో ఏం సమస్య వచ్చిందో విడిపోయింది. కానీ కొంతకాలంగా ఉత్తరప్రదేశ్‌లో ఉన్న తన కుటుంబసభ్యుల్ని కలుసుకోవాలని ఆందోళన చెందుతోంది. వెళ్లే మార్గం తెలియక తనకు సాయం చేయమంటూ విలే పార్లే పోలీసులను కోరింది. పోలీస్ స్టేషన్‌కి వచ్చిన ఆమెను పోలీసులు ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆమెకు తినడానికి ఏమైనా కావాలా? అని అడిగారు. ఆమె సమస్యను విని వెంటనే ఆమె కుటుంబ సభ్యుల అడ్రస్ ఆరా తీసారు. వివరాలు తెలుసుకుని వారికి కబురు పెట్టారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆమె కుటుంబ సభ్యులకు ఆమెను అప్పగించారు. ఇక ఆ వృద్ధురాలు ఆనందానికి హద్దులేదు. పోలీసులకు సంతోషంతో నమస్కరించి తన వారితో ఊరికి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ముంబయి పోలీసులు తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన ముంబయి జనం పోలీస్ డిపార్ట్ మెంట్ చేసిన మంచి పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. 'అన్నిచోట్ల పోలీసులు ఇదే విధంగా పనిచేయాలని కోరుకుంటున్నామని.. ముంబయి పోలీసులకు హ్యాట్సాఫ్' అంటూ కామెంట్లు పెట్టారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)