మాల్దీవులకు ఒక గస్తీ నౌక, ల్యాండింగ్ క్రాఫ్ట్ను భారత్ బహుకరించనుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మూడు రోజుల మాల్దీవుల పర్యటనలో మాల్దీవుల జాతీయ రక్షణ బలగాలకు ఈ బహుమతులు అందజేయనున్నట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం సోలీహ్ ఆహ్వానం మేరకు మే 1 నుంచి 3 వ తేదీ వరకూ ఆ దేశంలో రాజ్నాథ్ సింగ్ పర్యటించనున్నట్టు ఆ ప్రకటన పేర్కొంది. రాజ్నాథ్ సింగ్ తన పర్యటనలో భాగంగా మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్ షహీద్, రక్షణ శాఖ మంత్రి మారియా దీదీతో చర్చలు జరపనున్నారు. మాల్దీవులు అధ్యక్షుడు ఇబ్రహీం సోలీహ్ను కలుసుకుంటారు. భారత్-మాల్దీవులు తీరప్రాంత భద్రత, ఉగ్రవాదం, రాడికలైజేషన్, ప్రైవేసీ, ట్రాఫికింగ్, ప్రకృతి వైపరీత్యాలు సహా పలు సవాళ్లను మంరిత సమష్టిగా ఎదుర్కొనేందుకు రాజ్నాథ్ పర్యటన ఉపకరించనుందని, ఇరుదేశాల మధ్య మైత్రీ సంబంధాల్లో ఈ పర్యటన ఒక మైలురాయిగా నిలుస్తుందని రక్షణ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. రాజ్నాథ్ తన పర్యటనలో భాగంగా ప్రవాసభారతీయులను కూడా కలుసుకుంటారు.
మాల్దీవులకు గస్తీ నౌక, ల్యాండింగ్ క్రాఫ్ట్లను ఇవ్వనున్న భారత్ !
April 30, 2023
0
Tags