సుడి తిరిగింది !

Telugu Lo Computer
0


 బెంగళూరుకి చెందిన అరుణ్ దుబాయిలో పనిచేయడానికి వెళ్లాడు. అరుణ్ కి మొదటి నుండి లాటరీలు కొనే అలవాటు ఉంది. అలా అని ఏది పడితే అది కొనకుండా చాలా ఆలోచించి లాటరీ టికెట్ కొనుగోలు చేస్తుంటాడు. అయితే అనుకోకుండా  కొన్న మూడో లాటరీ టికెట్ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఏకంగా 45 కోట్ల రూపాయలు గెలవడం జరిగింది. ఈ క్రమంలో లాటరీ గెలవడంతో నిర్వాహకులు అరుణ్ కి మొదట ఫోన్ కాల్ చేయగా అంతా ట్రాష్ అని మోసం చేయడానికి ఫోన్ కాల్ చేస్తున్నట్లు భావించాడు. కానీ సదరు నెంబర్ నుండి ఫోన్స్ ఎక్కువసార్లు రావడంతో బ్లాక్ లో పెట్టడం జరిగింది. అయినా ఆ దుబాయ్ లాటరీ టికెట్ నిర్వహకులు పదేపదే అరుణ్ కి ఫోన్ చేయటంతో.. తన లాటరీ టికెట్ ఇంటర్నెట్లో చెక్ చేసుకోగా నిజంగానే గెలిచినట్లు తన నెంబర్ గుర్తించటంతో ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. లాటరీ టికెట్ గెలిచిన సమయంలో అరుణ్ మోకాలు ఆపరేషన్ చేయించుకుని హాస్పిటల్ లో ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులలో లాటరీ అది కూడా ఏకంగా 45 కోట్ల రూపాయలు రావటంతో ఉబ్బితప్పిపోయి భగవంతుడు కరుణ చూపాడు అని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. వచ్చిన డబ్బులతో ఇంకా ఎవరి దగ్గర పనిచేయకుండా సొంతంగా వ్యాపారం  ప్రారంభం చేయబోతున్నట్లు అరుణ్ తెలియజేయడం జరిగింది. ఓవర్ నైట్ లో అది కూడా ఫోన్ కాల్ బ్లాక్ చేసి దుబాయ్ లాటరీ నిర్వాహకులు అరుణ్ వెంటపడి మరి డబ్బులు అందించడం, ధనలక్ష్మి ఇచ్చిపడేసింది మనోడిని కోటీశ్వరుడు చేసిందనీ తాజా వార్త పై నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)