కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. కొరాటగిరి నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనలో ఆయన తలకు గాయమైంది. రక్తస్రావమైన ఆయన్ను అక్కిరాంపురాలోని స్థానిక ప్రాథమిక వైద్య కేంద్రంలో చికిత్స అందించారు. ఆ తర్వాత తుమకూరులోని శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజ్కు తరలించారు. ఆందోళనపడాల్సిన పడొద్దని ఆయన ఆరోగ్యపరిస్థితి సాధారణంగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు కర్ణాటకలో అన్ని పార్టీల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. రాహుల్ గాంధీ బళ్లారిలో రోడ్ షో నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దావణగెరెలో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29న కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 6 రోజుల్లో 22 ర్యాలీల్లో ఆయన పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
మాజీ ఉప ముఖ్యమంత్రిపై రాళ్ల దాడి !
April 28, 2023
0
Tags