దేశంలో కొత్తగా 11, 109 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గత 24 గంటల్లో 11, 109 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం ఉదయం వెల్లడించింది. ప్రస్తుతం 49,622 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులు 236 రోజుల గరిష్టానికి చేరినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇక గురువారం ఒక్కరోజే 29 మంది కరోనాతో మృతి చెందారు. ఢిల్లీ, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ముగ్గురు చొప్పున, ఛత్తీస్‌ఘర్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఇద్దరు చొప్పున, హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాకు బలయ్యారు. ఇక కేరళ రాష్ట్రంలో పది మంది మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం ఇప్పటివరకు దేశంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5,31,064కి చేరింది.


Post a Comment

0Comments

Post a Comment (0)