ప్రముఖ పారిశ్రామికవేత ఆనంద్ మహీంద్ కు ట్విటర్లో ఆయనకు సుమారు 10.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఆదివారం సరదా గురించి ఆయన చెప్పిన మాటలు నెట్టింట వైరల్గా మారాయి. ఓ వ్యక్తి తన వెనుక బ్యాగ్లో కూలింగ్ గ్లాస్ పెట్టుకున్న కుక్క పిల్లతో కలిసి బైక్పై ప్రయాణిస్తుంటాడు. ఈ వీడియోను మహీంద్రా షేర్ చేస్తూ.. ''సండే ఫీలింగ్ గురించి చెప్పేందుకు ఇంతకంటే మంచి వీడియో ఏముంటుంది''అని ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన అభిషేక్ జైశ్వాల్ అనే నెటిజన్ '' మహీంద్రా సార్ మీకు నాదో ప్రశ్న. మీరు దేశంలోనే పెద్ద పారిశ్రామికవేత్త. ఆదివారాన్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? '' అని అడిగాడు. ఆనంద్ మహీంద్రా నెటిజన్ ప్రశ్నకు బదులిస్తూ..''ఆదివారం సరదాగా గడిపేందుకు నా దగ్గర ఓ టెక్నిక్ ఉంది. దాన్నే నేను చాలా కాలంగా వాడుతున్నాను. ఆదివారం నేను పారిశ్రామికవేత్త అనే విషయాన్ని మర్చిపోతాను'' అని బదులిచ్చారు. మహీంద్రా సమాధానం చూసిన నెటిజన్లు ఆయనకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ''ఆదివారాన్ని ఆస్వాదించాలంటే ఇదే సరైన ఎంపిక. లేదంటే వ్యాపారం, ఇతర సమస్యలు వాటిని పరిష్కరించే మార్గాల గురించి ఆలోచిస్తూ ఎంజాయ్ చేయడం మర్చిపోతాం'' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ''వ్యక్తిగతంగా మీరు ఎంతో సాధారణమైన వ్యక్తిలా ఆలోచిస్తారనేందుకు ఇదే చక్కటి ఉదాహరణ'' అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. పారిశ్రామికవేత్తలకు వీకెండ్ సరదాలుంటాయా అని మరో నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు.
సండే ఫీలింగ్ గురించి చెప్పేందుకు ఇంతకంటే మంచి వీడియో ఏముంటుంది ?
March 26, 2023
0
Tags