మూడో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ నగరంలోని పెద వాల్తేరుకు చెందిన కనకస్వాతి (31)కి పారిశ్రామిక ప్రాంతం మాజీ సైనికుల కాలనీకి చెందిన సుధాకర్‌రెడ్డితో కొన్నాళ్ల కిందట కులాంతర వివాహం జరిగింది. సుధాకర్‌ ప్రైవేట్‌ కస్టమర్‌ కేర్‌ సెంటర్‌లో విధులు నిర్వహిస్తూ కుటుంబంతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఓ బాబు ఉన్నాడు. సజావుగా సాగుతున్న కాపురంలో ఇటీవలే కలహాలు ప్రారంభమయ్యాయి. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కనకస్వాతి బుధవారం ఉదయం 10 గంటల సమయంలో మాజీ సైనికుల కాలనీలోని నివాసం ఉండే భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకేసింది. తలకు తీవ్ర గాయమవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబీకుల సమాచారంతో మల్కాపురం పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి, వివరాలు నమోదు చేశారు. ఈ కేసుని మల్కాపురం సీఐ బి.లూథర్‌బాబు పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)