ఆకతాయి బిడ్డర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు

Telugu Lo Computer
0


హిమాచల్ ప్రదేశ్ లో కొత్త స్కూటీకి ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం బిడ్డింగ్‌లో రూ. 1 కోటికి పైగా టెండర్ వేసిన ముగ్గురు ఆకతాయి బిడ్డర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ డిప్యూటీ ముఖ్యమంత్రి ముకేష్ అగ్నిహోత్రి అధికారులను ఆదేశించారు. హెచ్‌పి 99 9999 అనే ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం బిడ్డింగ్‌ను ఆహ్వానిస్తూ హిమాచల్ ప్రదేశ్‌లోని కోట్‌ఖై రిజిస్టరింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీకి ఫిబ్రవరి 6న రూ. 1 కోటికి పైగా కోట్ చేస్తూ మూడు బిడ్స్ వచ్చాయి. అయితే ఈ మూడు బిడ్లు వేసిన వారు ఆకతాయిలని తేలడంతో ఆన్‌లైన్ వేలంను రిజిస్ట్రేషన్ శాఖ రద్దు చేసింది. ఆ ముగ్గురు బిడ్డర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చర్యలు చేపట్టాలని రవాణా శాఖకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న ఉప ముఖ్యమంత్రి అగ్నిహోత్రి అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్ పోర్టల్‌లో అవసరమైన మార్పులు చేయాలని, నాన్ సీరియస్ బిడ్డర్లను తొలగించే ప్రక్రియతోపాటు ఎర్నెస్ట్ మనీని డిపాజిట్‌గా తీసుకునే నిబంధన చేర్చాలని ఆయన సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)