క్రైస్ట్ చర్చ్ లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్, శ్రీలంకపై ఉత్కంఠ విజయం సాధించింది. దాంతో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు రూట్ క్లియర్ అయింది. జూన్ 7న లండన్ లోని ఓవల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ టైటిల్ కోసం తలపడనుంది. దీంతో వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన జట్టుగా భారత్ రికార్డు కొట్టింది. తొలి టెస్టులో శ్రీలంకపై న్యూజిలాండ్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి రోజు 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. విలియమ్సన్ సెంచరీ(121నాటౌట్)కి తోడు మిచెల్ 81 రన్స్ తో రాణించడంతో న్యూజిలాండ్ గెలిచింది. మ్యాచ్ చివర్లో వన్డే తరహాలో ఆడిన కివీస్ శ్రీలంక ఆశలపై నీళ్లు చట్టింది.
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు టీమిండియాకు లైన్ క్లియర్ !
March 13, 2023
0
Tags