మోడీ దురహంకారానికి పరాకాష్ఠ

Telugu Lo Computer
0


ఇది చీకటి రోజని, రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు అనర్హత వేటు వేయడం  నరేంద్ర మోడీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. మోడీ పాలన ఎమర్జెనీని మించిపోతోంది. ప్రతిపక్ష నేతలకు వేధించడం బీజేపీకి పరిపాటిగా మారింది. బీజేపీ దుశ్చర్యలను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్తకంఠంతో ఖండించాలని కేసీఆర్‌ పిలుపు ఇచ్చారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సైతం ఈ పరిణామంపై స్పందించారు. రాహుల్‌ గాంధీపై వేటు అప్రజాస్వామికమని పేర్కొన్నారాయన. ఇలా చేయడం రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడమే. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు కేటీఆర్‌. రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని అన్యాయంగా రద్దు చేశారు. తమ వైఫల్యాలు, అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ కుట్రకు దిగింది. ప్రతిపక్షాల అణచివేతలో మోదీ మిషన్‌ పెద్ద భాగం అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)