రాహుల్ లాగా తాము కూడా గాంధీ ఇంటి పేరు ఉన్నవారందరి పైనా నిందలు వేయడం లేదు కదా అంటూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విటర్ వేదిక వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ''కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలతో దేశ ప్రజాస్వామ్యాన్ని, సాయుధ దళాలను, దేశ సంస్థలను, ఓబీసీ కమ్యూటినినీ కించపరుస్తున్నారు. అలా అని మేం గాంధీ ఇంటిపేరు ఉన్న ప్రతి ఒక్కరిని నిందిచట్లేదు కదా. ఆయన వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్కు తీవ్ర నష్టం కలుగుతోంది. అయినా ఆ పార్టీ నేతలు ఆయనకు మద్దతుగా నిలవటం ఆశ్చర్యకరం' అంటూ రిజిజు ఎద్దేవా చేశారు.
మేం 'గాంధీ' పేరున్న వారిని నిందించట్లేదు కదా !
March 24, 2023
0
Tags