దేశంలో గత 24 గంటల్లో 1,43,364 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,994 కొత్త కేసులు బయటపడ్డాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 16వేలు దాటింది. ప్రస్తుతం 16,354 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి 4,41,71,551 మంది కోలుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో కేరళలో ముగ్గురు, గోవా, గుజరాత్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మృతి చెందారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.04 శాతం యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రికవరీ రేటు 98.77 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.66కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో కొత్తగా 2,994 కరోనా కేసులు నమోదు
April 01, 2023
0
Tags