కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో జైళ్లలో రద్దీని తగ్గించేందుకు వివిధ నేరాల్లో శిక్షను అనుభవిస్తున్న దోషులు, విచారణ ఖైదీలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, వారందరూ 15 రోజుల్లోపు సంబంధిత జైలు అధికారుల ముందు లొంగిపోవాలని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది. మహమ్మారి సమయంలో అత్యవసర, మధ్యంతర బెయిళ్లపై విడుదలైనవారు ఈ మేరకు లొంగిపోవాలని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. లొంగిపోయిన అనంతరం విచారణ ఖైదీలు.. రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ధర్మాసనం తెలిపింది. అదేవిధంగా దోషులు సైతం లొంగిపోయిన తర్వాత.. తమ శిక్షను రద్దు చేయాలని కోరుతూ, చట్టాలకు లోబడి న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని చెప్పింది. మరోవైపు, కరోనా తీవ్రత దృష్ట్యా సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సుల మేరకు.. వివిధ రాష్ట్రాల్లో స్వల్ప తీవ్రత కలిగిన నేరాలకు పాల్పడిన అనేక మంది నేరస్థులు, విచారణ ఖైదీలను విడుదల చేశారు. తాజాగా వారందరూ లొంగిపోవాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
Post Top Ad
adg
Friday, 24 March 2023
Home
National
కరోనా సమయంలో విడుదల చేసిన ఖైదీలంతా 15 రోజుల్లో లొంగిపోవాలి
జైళ్లలో రద్దీని తగ్గించేందుకు
విచారణ ఖైదీలను ప్రభుత్వం విడుదల చేసింది
సుప్రీంకోర్టు
కరోనా సమయంలో విడుదల చేసిన ఖైదీలంతా 15 రోజుల్లో లొంగిపోవాలి
కరోనా సమయంలో విడుదల చేసిన ఖైదీలంతా 15 రోజుల్లో లొంగిపోవాలి
Tags
# National
# కరోనా సమయంలో విడుదల చేసిన ఖైదీలంతా 15 రోజుల్లో లొంగిపోవాలి
# జైళ్లలో రద్దీని తగ్గించేందుకు
# విచారణ ఖైదీలను ప్రభుత్వం విడుదల చేసింది
# సుప్రీంకోర్టు
About Telugu Lo Computer
సుప్రీంకోర్టు
Tags
National,
కరోనా సమయంలో విడుదల చేసిన ఖైదీలంతా 15 రోజుల్లో లొంగిపోవాలి,
జైళ్లలో రద్దీని తగ్గించేందుకు,
విచారణ ఖైదీలను ప్రభుత్వం విడుదల చేసింది,
సుప్రీంకోర్టు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment